Site icon TeluguMirchi.com

కిరణ్ ఓ అజ్ఞాన మహాసముద్రం: కేటీఆర్

HY06KTR_GCR3SAS3K_1_856843f-285x250సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కిరణ్ ఓ అజ్ఞాన మహాసముద్రమని వ్యాఖ్యానించారు. కిరణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడారని, ఆయన వైఖరి చూస్తే.. ‘తెలంగాణ ఎండాలి, సీమాంధ్ర పండాలి, నా పదవి ఉండాలి’.. అన్నట్టుందని దుయ్యబట్టారు. రాష్ట్రం విడిపోతే జలవివాదాలు వస్తాయని, ఆ లెక్కన కృష్ణా, గోదావరి జలాల కోసం మూడు రాష్ట్రాలు కలిసుండాల్సిన పరిస్థితి ఉందని సీఎం అంటున్నారని.. ఆ విధంగా అయితే, దేశంలో జలవివాదాలు తలెత్తకుండా ఉండాలంటే రాష్ట్రాలే ఉండకూడదన్నది ఆయన అభిప్రాయంలా ఉందని వ్యాఖ్యానించారు.

Exit mobile version