Site icon TeluguMirchi.com

బాబుది ఏ ’వాదం’ : కేటీఆర్

ktrతెదేపా అధినేత చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు తెరాసనేత కేటీఆర్. అఖిలపక్ష భేటీకి తెదేపా హాజరుకాకపోవడంఫై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు సమైక్యవాదో.. విభజనవాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఢిల్లీలో కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.. సమన్యాయం పేరుతో బాబు తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఎన్నికలకు ఆరు నెలల ముందు కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందన్న బాబు.. అదే 2009లో ఎన్నికల తరవాత ఆరునెలలకు తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించారని ఆయన ప్రశ్నించారు.

Exit mobile version