అయితే, మహనీయుల విగ్రహాలను మట్టిబొమ్మలనడం శోచనీయమని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఇది కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. గతంలో కెసిఆర్ విబజనకు ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను చదివి వినిపించడానికి ప్రయత్నించారు.ఛీప్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కూల్చిన విగ్రహాలను మట్టి బొమ్మలతో పోల్చడం సబబు కాదని పేర్కొన్నారు. దీంతో సభలో కాస్త గందరగోళం ఏర్పడింది.