తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు తెదేపా అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం లేదని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. విభజనపై అఖిలపక్ష సమావేశాన్ని డిమాండ్ చేసిన చంద్రబాబే… ఇప్పుడు ఆ సమావేశానికి వెళ్లడం లేదని అనడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిగా మారిందన్నారు. ఇప్పటికే విభజనపై నిర్ణయం జరిగి, కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రపతి ఏదో ఆపుతారంటూ ప్రచారం చేయడం సరికాదని కెటిఆర్ అన్నారు. రాష్ట్రపతికి ఇందులో ఏమైనా విశేష అదికారాలు ఉంటాయా అని కెటిఆర్ ప్రశ్నించారు. కిరణ్ కాని, సీమాంద్ర కాంగ్రెస్ నేతలంతా ఇదే తరహాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.