Site icon TeluguMirchi.com

ఏపీ సీఎస్ గా కృష్ణారావు!

IYR-KRISHNA-RAO

ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెట్టారు. అపాయింటెడ్ డే దగ్గర పడుతుండడంతో.. ముఖ్యమైన అధికార యంత్రాంగాన్ని ఎంపిక చేసుకొంటున్నాడు. సమర్థవంతమైన, నిజాయతీ అధికారుల కోసం కసరత్తు చేసి కొంతమందిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఐ.వై.అర్.కృష్ణారావును ఎంచుకున్నట్టు సమాచారం. ఇక, డీజీపీగా జె.వి.రాముడును ఎంపిక చేశారు. ప్రస్తుత డీజీపీ ప్రసాదరావును హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించనున్నారు. సీ.ఎం. పేషీలో కీలక పదవి ముఖ్యమంత్రి పీ.ఎస్.గా అజయ్ సహానీ రానున్నారు. అక్కడే కార్యదర్శులుగా గిరిధర్, సాయిప్రసాద్ లను చంద్రబాబు ఎంచుకున్నారు. అలాగే, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) ద్వారకా తిరుమలరావు ఎంపికయ్యారు.

Exit mobile version