తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న ‘శాంతి సద్భావన దీక్ష’ కు హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నాటి యూటీ భావనను ఇప్పుడు కొందరు డిమాండ్ చేస్తున్నారని.. పూర్తిగా నష్టదాయకమైనది కాబట్టే ఆ డిమాండ్ను తిరస్కరిస్తున్నామని చెప్పారు. భిన్న సంస్కృతులు ఉన్నందున రాయల తెలంగాణ కూడా సరికాదన్నారు. ప్రజల రక్షణ అనేది కాగితాల్లో ఉండాలని ఏమీ లేదని, ప్రజలు సఖ్యతతో ఉంటే చాలని కోదండరాం ఈ సంధర్బంగా చెప్పారు.