రాజీనామా యోచనలో కొండా వర్గం?

konda-surekhaమాజీమంత్రి, వైకాపా సీనియర్ నేత కొండా సురేఖ వర్గం వైకాపాకు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు కేంద్రబిందువుగా ఉన్నప్పటికినీ.. కొండా దంపతులు వైకాపాకు ఆది నుంచి అండగా ఉంటూ.. వస్తున్నారు. అయితే కొండా దంపతులకు తెలియకుండానే వారి వర్గానికి చెందిన నలుగురిపై వేటు వేయడంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు వారికి మద్దతుగా రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. వైకాపా వరంగల్ జిల్లా కన్వీనర్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఈరోజు కొండా దంపతులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం శ్రీనివాస రెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొండా దంపతులు మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరవచ్చనే ప్రచారం జోరుగా సాగుతుంది.