‘ఏం.. నాటకాలాడుతున్నారా’…?

konda-surekhaవైకాపా లో తెలంగాణ లొల్లి మొదలైంది. తొలి విడత పంచాయితీ సమరంలో తెలంగాణలో తేలిపోవడంతో.. సమైక్యాంధ్ర కోసం రాజీనామాల పర్వానికి తెరలేపిన వైకాపాకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. ఆ పార్టీ తెలంగాణ నేతలు పార్టీలో ఉండాలా..? లేదా..? అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ మరణాంతరం నుంచీ జగన్ వెన్నంటే ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖ వైకాపా ఎమ్మెల్యేల రాజీనామాలను ఖండించారు. తెలంగాణ వస్తున్న తరుణంలో.. సీమాంద్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల తెలంగాణలో తాము నష్టపోతామని కొండా అభిప్రాయపడ్డారు. ఇది ఎమ్మెల్యేల వ్యక్తిగత నిర్ణయమా? పార్టీ నిర్ణయమా అన్నది తేలాలని ఆమె అన్నారు. పార్టీ నిర్ణయమైతే.. పార్టీలో ఉండాలా? లేదా అన్న విషయం తేల్చుకోవలసి వస్తుందని ఆమె అన్నారు. ఈ విషయంపై గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.