చచ్చిపోదాం రా..! : కొండా సురేఖ

konda-surekhaతెలంగాణలో వైకాపా, టీఆర్ ఎస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరుపార్టీల వారు ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజాగా వైకాపా నాయకురాలు కొండసురేఖ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కు చచ్చిపోదాం రా…! అని సవాల్ విసిరిరారు. ‘ఢిల్లీలో… సోనియా ఇంటి దగ్గరికి రా! తెలంగాణ కోసం ఇద్దరం ఆత్మహత్య చేసుకుందాం!’ అని మంగళవారం ఆమె కేసీఆర్కు సవాల్ విసిరారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

పరకాల ఉపఎన్నికలో టీఆర్ ఎస్ ను గెలిపిస్తే కేవలం 3 నెలల్లో తెలంగాణ తెస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చి 100 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ దానంతట అదే వస్తుందంటూ మరో కొత్త నినాదాన్ని ఎత్తుకుంటున్నారని ఎద్దేవా చేశారు. “కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు బతికున్నంత కాలం ప్రత్యేక తెలంగాణ రాదు. వారంతా మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటే తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు” అని సురేఖ పునరుద్ఘాటించారు.