వైకాపాలోనే కొండా దంపతులు..!

konda-surekhaవరంగల్ జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొండా మురళీ, సురేఖ దంపతులు వైకాపాలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చంఛల్ గూడ జైలులో వున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కొండా దంపతులు ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల పాత్రంలో కలిశారు. అయితే గతకొద్ది కాలంగా పార్టీ కార్యకలాపాలకు కొండా దంపతులు దూరంగా ఉంటున్నారు. కొండా దంపతులు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారనే ప్రాచారం కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో.. పార్టీ అధినేతను కలిసిన కొండా దంపతలు వైకాపాలోనే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.