Site icon TeluguMirchi.com

ప్రజలు తరిమికొడతారు…

komatireddy venkat reddyసీఎం మతిభ్రమించి మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారని మాజీమంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. దోచుకున్నవి దాచుకోవడానికే సమైక్య నాటకమాడుతున్నారని ఆయన అన్నారు. ఆయన మాట్లాడే మాటలకు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆయన్ను తరిమికొడతారని అన్నారాయన. ఆయన వ్యాఖ్యలు సీమాంధ్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్య శత్రుత్వం పెంచేలా ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యక్తికి తెలంగాణలో, హైదరాబాద్ లో తిరిగే హక్కులేదని విమర్శించారు. ప్రజలతో సంబంధంలేని వ్యక్తిని సీఎంగా చేయడం సోనియాగాంధీ చేసిన తప్పని అన్నారు. లాభీయింగ్ ద్వారా ముఖ్యమంత్రి అయిన ఆయన సోనియాను, దిగ్విజయ్ సింగ్ ను విమర్శించడం బాధాకరమన్నారు. నిజంగా సీఎంకు ప్రజలపై ప్రేమ ఉంటే సీడబ్ల్యూసీ నిర్ణయం వచ్చిన నాడే రాజీనామా చేసి ఉండాలని ఎద్దేవా చేశారు. ఆయన తెలుగు అటు సీమాంధ్రులకు,ఇటు తెలంగాణ వారికి ఎవరికీ అర్థంకాదని అన్నారాయన. పదవిని అడ్డం పెట్టుకుని వందలకోట్ల రూపాయలు సంపాదించిన ఆయన అవినీతి బాగోతాన్ని త్వరలోనే బయటపెడతామని గట్టిగా విమర్శించారు.

Exit mobile version