తెలుగుజాతి మధ్య చిచ్చు పెట్టింది !

kodelaఇటలీ లో పుట్టిన సోనియా తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టిందని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఆరోపించారు. గుంటూరు లో ఆయన మీడియా తో మాట్లాడుతూ… రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఎంపీలు లగడపాటి, మోదుగులను తప్పుబట్టడం సరికాదన్నారు. భౌతికదాడులకు తెరదీసిన ఎంపీలే మొదటి ముద్దాయిలని పేర్కొన్నారు. నియంత ముస్సోలినీ పుట్టిన దేశంలో జన్మించిన సోనియా .. గాంధీ పుట్టిన దేశానికి కళంకితం చేస్తోందని విమర్శించారు.