Site icon TeluguMirchi.com

ఆదివాసులను బలిచేస్తున్నారు!

M Kodandaram

అభివృద్ధి పేరుతో ఆదివాసీలను బలి చేస్తున్నారని టీ-జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కోదండరాం పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచేందుకు ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఆదివాసీలపై వివక్షకు నిదర్శనమే పోలవరం ప్రాజెక్టని ఆరోపించారు. కాగా, పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ.. భధ్రాచలం ఎమ్మెల్యే రాజయ్య చేపట్టిన నిరాహార దీక్ష నేటితోమూడో రోజుకు చేరుకుంది.

Exit mobile version