గల్లీ నుంచి ఢిల్లీ వరకు కుట్ర !

kodandaramరాష్ట్ర విభజన బిల్లు ఆపడానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కుట్ర జరుగుతోందని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం ఆరోపించారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం చేపట్టిన ‘సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష’ ముగిసింది. ఈ సందర్భంగా కోదండరాం మీడియాతో మాట్లాడారు. బిల్లుకు సవరణ పెడితే ఓటింగ్ ను ఆమోదించే పరిస్థితి లేదన్నారు. బిల్లును ఆపి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టొద్దన్నారు. గవర్నర్ నుంచి శాంతి భద్రతల అధికారాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. విభజన తర్వాత ఉమ్మడి హైకోర్టు కాకుండా రెండు హైకోర్టులు ఉండేలా సవరణలు చేయాలని సూచించారు.