శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతాం

Kodandaramప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. హైదరాబాద్ లో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని టీ-రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. వరంగల్ లోని కాళోజి సెంటర్‌ లో జరుగుతున్న తెలంగాణ జేఏసీ దీక్షలో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీమాంధ్రలో ప్రభుత్వమే ఉద్యమాన్ని చేయిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మేల్కొని ప్రకటన అమలయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ సభకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. సీమాంధ్ర నేతలు నీటి సమస్యను బూచిగా చూపి అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని అయన ఆరోపించారు. కాగా, ఈరోజు సాయంత్రం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు.