Site icon TeluguMirchi.com

తేడా వస్తే తీవ్ర కార్యాచరణ : కోదండరాం

kodandaram10 జిల్లాలు, హైదరాబాద్ తో కూడిన సంపూర్ణ తెలంగాణనే తామందరం కోరుకుంటున్నామని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో టీజేఏసీ స్టీరింగ్ కమిటీ ముగిసిన అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు లో తేడా వస్తే తీవ్ర కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్ పై గవర్నర్ అజమాయిషీని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. ఇక రేపటి తెలంగాణ బంద్ కు తెలంగాణ రాజకీయ జేఏసీ మద్దతు పలుకుతోందని తెలిపారు. బంద్ ను అందరు కలసి విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు.

Exit mobile version