కిరణ్ పై టీ-కాంగ్రెస్ నేతలే.. ఇలా కాలుదువ్వేంత పని చేస్తుంటే.. అసలు ముఖ్యమంత్రి పనిచేయకుండానే పైసలు (జీతం) తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు టీ-రాజకీయ జేఏసీ చైర్మెన్ ప్రొ. కోదండరాం. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి.. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. గత యాభై రోజులుగా ముఖ్యమంత్రి పని చేయడం కొద్దిగా తగ్గించారేమో అనే అనుమానం రాక మానదు. అయితే, కోదండరాం చేసిన వ్యాఖ్యల్లో కాస్త నిజం లేకపోలేదని పలువురు అభిప్రాయడుతున్నారు. కానీ, ఎదుటివారిని విమర్శించే ముందు.. మనం ఏం చేస్తున్నామనే సృహ కూడా కలిగి వుండాలి కదా..!
ఎందుకంటే, గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ జెఎసి ఛైర్మన్ గా వున్న కోదండరామ్ ప్రొఫెసర్ గా తన వృత్తిని అసలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నాలుగు సంవత్సరాలుగా జేఏసీలో తెగ బిజీ గా వుంటూ యూనివర్సిటీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. కానీ జీతం మాత్రం టంచనుగా నెల మొదటి తారీకు నాటికి తీసుకొంటున్నారనేది ఆయనపైన వచ్చిన అపవాద. ఎవరు ఎన్ని అన్నా.. ఎన్ని విమర్శలు చేసినా కోదండరాం పట్టించుకోలేదు. పూర్తి స్థాయి రాజకీయ ఉద్యమం లో వుంటూ, పలు మార్లు కేసులు పెట్టబడి జైలు కు వెళ్ళినా కూడా ప్రొఫెసర్ గా కొనసాగడం మానలేదు.
ఇలాంటి ఆరోపణలు తనపై పెట్టుకొని ముఖ్యమంత్రి పని చేయకుండా పైసలు తీసుకుంటున్నారనడం కోదండరాం వంటి పెద్ద మనుషులకు తగునా.. ? కానీ తాను ఆసలు పని చేయకుండా ఇంకొక వ్యక్తి పని చేయచేయట్లేదని వేలెత్తి చూపించే సంస్కారం ప్రొఫెసర్లకు కూడా పాకడం చింతించాల్సిన విషయమే ! అలా కాకుండా ఇంకా వేరే విధంగా ఆయన ముఖ్యమంత్రిని విమర్శిస్తే.. ఎవరు ఆశ్చర్యపోవాల్సిన పని వుండేది కాదు. అయిన ఎప్పుడు సీరియస్ గా వుండే కోదండరామ్ అప్పుడప్పుడు ఇలా కొన్ని జోకులు కూడా చెప్తారు అని సరిపెట్టుకోవాలేమో..!