Site icon TeluguMirchi.com

అఖిలపక్షానికి కోదండరాం..!

Kodandaramజేఏసీ తరపున నిరసన కార్యక్రమాలన్నీ శాంతియుతంగానే చేపడతామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ తెలిపారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసిన తరువాత కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 26న మండల కేంద్రాల్లో దీక్షలు, 27 ఉదయం నుంచి 28 ఉదయం వరకు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తామని వివరించారు. ఈ దీక్షలలో తెలంగాణకు మద్దతిచ్చే అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు పాల్గొంటాయని తెలిపారు. 28న జరిగే పరిణామాలు చూసిన తర్వాత 29న కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పోలీసులు సంయమనం పాటించి వివాదాలకు అవకాశం లేకుండా చూడాలని కోరారు.
జేఏసీ విమలక్క విడుదల గురించి మాట్లాడలేదనడంలో వాస్తవం లేదని చెప్పారు.  ఇప్పటికే విమలక్కను విడుదలచేయాలని డిమాండ్ చేశామన్నారు. అఖిలపక్షానికి తాను హాజరయ్యేది లేనిది ఇంకా తేలలేదన్నారు. అన్ని పక్షాలతో చర్చించిన తర్వాతే ప్రకటిస్తామని చెప్పారు. వరుస కార్యక్రమాలతో కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పక్షాలపై ఒత్తిడి పెంచుతామన్నారు.

 

Exit mobile version