Site icon TeluguMirchi.com

ప్రత్యామ్నాయాలు చూపితే ప్రతిఘటన..!

kkతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ సవరణ అవసరం లేదని తెరాస నేత కేకే అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశంపై ఈ సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంకానున్న నేపథ్యంలో.. కేకే విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయాలకు పోకుండా 10జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రత్యామ్నాయాలకు ప్రయత్నిస్తే.. ప్రతిఘటిస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ తో కూడిన ప్రత్యేక తెలంగాణను తప్ప.. ఇంకొదానికి అంగీకరించేది లేదని ఆయన అన్నారు. రాజ్యాంగ సవరణ అవసరమన్న దిగ్విజయ్ వ్యాఖ్యలను కెకె ఖండించారు. మిగితా ప్రాంతాలకు భిన్నంగా తెలంగాణ అంశముందని కేకే అభిప్రాయపడ్డారు.

Exit mobile version