తెలంగాణ అంశంపై కిరణ్ కుమార్ రెడ్ది చేసిన వ్యాఖ్యాలకు సీమాంధ్ర నేతల మద్ధతు లభిస్తుంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కఠోరమైన నిజాలు వెల్లడించారని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో ఉండవల్లి ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తప్పు పట్టాల్సిన అవసరం లేదని, ఎవరైనా తన అభిప్రాయాలు స్వేచ్చగా వెల్లడించవచ్చనేది కాంగ్రెస్ పార్టీ విధానమని అన్నారు. కాగా, అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు విప్ లుండవని ఉండవల్లి స్పష్టం చేశారు.