మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు ఎన్. కిరణ్కుమార్రెడ్డి , చిరంజీవి పై మండి పడ్డారు. విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేశారని పై ఆయన ఈ రోజు స్పందించారు. చిరంజీవి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లో డైలాగులు చెప్పడం సరికాదన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పూర్తిగా అవాస్తవాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడాల్సిన అవసరం లేదన్నారు.