Site icon TeluguMirchi.com

త్వరలో కీలక నిర్ణయం : కేవీపీ

KVP-RamaChandra-Raoకాంగ్రెస్ ఎంపీ కెవీపీ రామచంద్రరావు నివాసంలో ఈరోజు (శనివారం) పలువురు సీమాంధ్ర మంత్రులు సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో ముఖ్యంగా ఢిల్లీ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశమనంతరం కేవీపీ మాట్లాడుతూ..  మంగళవారం మరోమారు సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, వట్టి వసంత్‌కుమార్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు, మంత్రుల ప్రాంగణంలో ఈరోజు టీ-మంత్రులు, ముఖ్యనేతలంతా టీ-రాజకీయ జేఏసీతో సమావేశమై ముఖ్యమంత్రి వైఖరి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Exit mobile version