కేరళ మంత్రిపై భార్య ‘గృహహింస’ ఆరోపణలు

Kerala-Forest-Minister-KB-Ganesh-Kumarవరకట్నం, గృహ హింస ఆరోపణలు వస్తే సామాన్యుడే కాదు మంత్రైనా, ఎవరైనా ఒకటే. తాజాగా కేరళ పాలక కూటమిలో భాగస్వామి అయిన కేసీ(బీ) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖ మంత్రి కేబీ గణేశ్ కుమార్ తనను హింసిస్తున్నాడంటూ భార్య యామిని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో భార్య నుంచి తనకు విడాకులు కావాలని మంత్రి కోర్టుకెళ్లారు. అయితే యామిని గృహహింస నేరం కింద మంత్రిపై కేసు పెట్టడంతో.. గణేష్ మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. గత 16 సంవత్సరాలుగా తాను గృహ సింసను ఎదుర్కొంటున్నానని మంత్రి భార్య వెల్లడించింది. అయితే ఈ పిటిషన్ ఏప్రిల్ 30న విచారణకు రానుంది. కాగా, ఇటీవలే ఒడిషా న్యాయశాఖ మంత్రిపై తీవ్ర వరకట్న ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఊచలు లెక్కపెడుతున్నారు.