తెరాస అధినేత కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా జైలుకు చేరుకున్నారు. సడక్ బంద్ సందర్భంగా.. అరెస్టై జైలులో ఉన్న తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలను పరామర్శించడానికి కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా జైలుకు చేరుకున్నారు. కేసీఆర్ తో పాటుగా టీఆర్ ఎస్ నేతలు హారిష్ రావు, నాయిని నర్సింహారెడ్డి వచ్చారు. కాంగ్రెస్ నేతలు కేకే, మందా జగన్నాథం, రాజయ్యలు జైలు కూడా జైలులో ఉన్న కోదండరాం మరియు ఇతర జేఏసీ నేతలను పరామర్శించారు.