మేడమ్ తో రాజకీయాలు మాట్లాడలేదు !

kcrకాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆయన కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. కేసీఆర్ తో పాటు కుమారుడు తారకరామారావు, కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్ రావు సోనియా నివాసానికి తరలి వెళ్లారు. సోనియాతో భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… కుటుంబసభ్యులతో కలిసి సోనియాకు ధన్యవాదాలు తెలిపామని చెప్పారు. రాజకీయ అంశాలగురించి సోనియాతో మాట్లాడలేదని, వాటి గురించి దిగ్విజయ్ సింగ్ మాట్లాడతారని సోనియా చెప్పారని కేసీఆర్ తెలిపారు. మరో రెండ్రోజులు ఢిల్లీలోనే ఉంటానని, రాష్ట్రపతి, ప్రధానిని కలిసి కృతజ్ఞతలు చెబుతానని కేసీఆర్ వెల్లడించారు.