బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ . తెలంగాణ పర్యటన సందర్భంగా నల్గొండ జిల్లాలో అమిత్ షా పచ్చి అబద్దాలు, అసత్యాలు చెప్పారని , తప్పుడు ప్రచారం చేసినందుకు అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు కేసిఆర్.
దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఉందని, తెలంగాణ ప్రభుత్వ పాలసీలన్నీ అద్భుతంగా ఉన్నాయని , తెలంగాణ ప్రజల బాగోగుల కోసమే తమ కృషి అని, తెలుసు.. నన్ను వ్యక్తిగతంగా మాటలు అన్నాపడతాను కానీ తెలంగాణ వ్యవస్థనే కించపరుస్తూ మాట్లాడితే నా ప్రాణం పోయినా ఊరుకోనుని హెచ్చరించారు కేసీఆర్. కేసీఆర్ వ్యాఖ్యానించారు. రూలింగ్లో ఉన్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడవలసిన మాటలేనా అని విమర్శించిన కేసిఆర్.. అమిత్ షా భ్రమిత్ షా మారారని ఎద్దేవా చేశారు.