Site icon TeluguMirchi.com

టీ – విధ్వంసంపై సవాల్

kcr

టీ-కాంగ్రెస్ నేతలపై కౌంటర్ అటాక్ చేశారు తెరాస అధినేత కేసీఆర్. ఇటీవల కాలంలో టీ-కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా కేసీఆర్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. వీరి విమర్శలను కేసీఆర్ ’నిజామాబాద్ నగరా’ వేదికగా తిప్పికొట్టారు. నిన్న (మంగళవారం) రాత్రి నిజామాబాద్ లోని గిరిరాజ్ మైదానంలో జరిగిన ’నిజామాబాద్’ నగరా లో కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్సే లక్ష్యంగా విమర్శనాబాణాలను సంధించారు.

కాంగ్రెస్ నేతలకు చీమూనెత్తురు లేదని కేసీఆర్ మండిపడ్డారు. 60యేళ్ల ఆంధ్రా పాలకుల పాలనలో తెలంగాణ విధ్వంసం జరిగిందని నేనంటున్నాను. జరగలేదని పొన్నాల లక్ష్మయ్య అంటున్నాడు. దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వేదిక ఏ జిల్లానో పొన్నాలనే డిసైడ్ చేయాలని కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా.. తెలంగాణ ప్రజలకు తెరాస హామిలను మరోసారి గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత, 9జిల్లాల ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.

Exit mobile version