Site icon TeluguMirchi.com

విలీనమా? పొత్తా ?

kcrతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ఈ రోజు మధ్యాహ్నం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కుటుంబసమేతంగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీకి కృతఙ్ఞతలు తెలపనున్నారు. ఇదీలావుంటే, కాంగ్రెస్ లో తెరాస విలీనంపైనే చర్చించేందుఈ భేటి జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తే.. తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని గతంలో కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే విలీనానికి అంత తొందరలేదని, ఇప్పటికైతే పొత్తు మాత్రమే వుంటుందని మరో వాదన వినిపిస్తోంది.

Exit mobile version