ఒక్కటిగా వెళ్దాం !

jana kcrరాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటి లో పలు కీలక అంశాలు చర్చలోకి వచ్చాయి. ‘టి’ నేతలమంతా ఒక్కటిగా పోరాడుదాని, ఇందుకోసం జనవరి 2వ తేదీన అఖిల పక్షాన్ని నిర్వహించాలని ఈ భేటి లో నిర్ణయించినట్లు తెలుస్తోంది. బిల్లు పైన ఏ పార్టీకి ఆ పార్టీ వేర్వేరుగా వెళ్తే తెలంగాణ ప్రాంతానికే నష్టమని, అన్ని పార్టీలను కలుపుకొని వెళ్ళాలని ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో అనేక సవరణలు చేయాల్సి ఉందని, లేదంటే తెలంగాణకు నష్టమని, సవరణల తర్వాతనే బిల్లు పార్లమెంటుకు వచ్చేలా చూడాలని, జివోఎం చెప్పని పలు విషయాలను కూడా బిల్లులో చేర్చారని ఈ సందర్భంగా జానాతో కెసిఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.