Site icon TeluguMirchi.com

టీ-ఎంపీలకు కేసీఆర్ హామి !

t-mp'sతెరాస అధినేత కేసీఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావుతో పాటుగా ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలతో.. తన ఫాంహౌజ్ లో నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నలుగురు జంప్ జలానీలకు.. కేసీఆర్ పదవులు, టిక్కెట్ల విషయంలో స్పష్టమైన హామి ఇచ్చినట్లు తెలుస్తోంది. టీ-కాంగ్రెస్ ఎంపీలు మంద జగన్నాథం, వివేక్, రాజయ్యలకు మరియు కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావులకు టికెట్ల విషయంలోనే కాకుండా.. వారి రాజకీయ వారసులకు ఈ భేటీలో కేసీఆర్ నుంచి హామి లభించినట్లు సమాచారం. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ నలుగురు కూడా జూన్ 3న గులాబి గూటికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో తెలంగాణ అంశంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈనెల 30వరకు అధిష్టానానికి డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే.

Exit mobile version