ప్రధానితో కేసీఆర్ భేటీ!

kcr-meet-manmohanటీ-బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు తెరాస అధినేత కేసీఆర్ వివధ జాతీయ పార్టీల నేతలతో భేటీ అవుతూ వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగాఈరోజు ఉదయం కేసీఆర్ ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశమయ్యారు. కేసీఆర్ తో పాటు ఆ పార్టీ నేతలు వివేక్, మందా జగన్నాథం తదితరులు వున్నారు. ప్రధానితో భేటీ అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. టీ-బిల్లును కచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని ప్రధాని చెప్పినట్ల తెలిపారు. బిల్లులోని సవరణలు కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని, రాత పూర్వకంగా వాటిని మన్మోహన్ కు అందజేసినట్లు ఆయన తెలిపారు. కాగా, పార్లమెంట్ బీఏసీ సమావేశం అనంతరం అన్ని విషయాపై పూర్తి స్థాయిలో స్పందిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. భాజాపా జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో కూడా కేసీఆర్ ఈరోజు సమావేశమయ్యే అవకాశాలున్నట్లు సమాచారమ్.