పోలవరం టెండర్లను రద్దు చేయండి: కవిత

Kavitaపోలవరం టెండర్లను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె ఈరోజు సచివాలయంలోని సీఎం కార్యాలయంలో ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఖమ్మంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గ్రామాలు, పల్లెలు నీట మునుగుతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం టెండర్లు రద్దు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది కవిత ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.