Site icon TeluguMirchi.com

మరో పాతికేళ్లలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఎమౌతాయి!

Katjuమరో 20, పాతికేళ్లలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఏకమవుతాయని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. ఇవాళ సాలార్ జంగ్ మ్యూజియంలో `ఉగ్రవాద వార్తలను అందివ్వడం – మీడియా పాత్ర` అనే అంశం మీద ఏర్పాటైన సదస్సులో పాల్గొని కట్జూ ప్రసంగించారు. పేదరికం, అసమానతలే ఉగ్రవాదానికి కారణమని కట్జూ అభిప్రాయపడ్డారు. అఖండ భారతావనిలో మతాల చిచ్చుపెట్టి బ్రిటీషర్లు పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. ఫలితంగానే పాకిస్థాన్ అనే దొంగ దేశం అవతరించిందని కడ్జూ పేర్కొన్నారు. ఈ సదస్సును హిందూ దినపత్రిక, హెల్ప్ హైదరాబాద్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించాయి.

Exit mobile version