Site icon TeluguMirchi.com

యూపీఏ, ఎన్డీయేల ఓటమే థర్డ్ ఫ్రంట్ లక్ష్యం:కారత్

praksh karatవచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 పార్టీల కూటమిగా పోటీచేయాలని నిర్ణయించినట్లు సీపీఐ నేత ప్రకాశ్‌కారత్ పేర్కొన్నారు. ఢిల్లీలో మూడో కూటమి (ధర్డ్ ఫ్రంట్) సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, భాజపాయేతర పార్టీలన్నీ ఇవాళ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూపీఏ పాలన అవినీతిమయమైందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అవినీతి పెచ్చరిల్లిందని అన్నారు. భాజపా, కాంగ్రెస్ విధానాల్లో పెద్ద తేడా ఏమీ లేదని కారత్ పేర్కొన్నారు. కాంగ్రెస్, యూపీఏ కూటమి ఓటమే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version