యూపీఏ, ఎన్డీయేల ఓటమే థర్డ్ ఫ్రంట్ లక్ష్యం:కారత్

praksh karatవచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 పార్టీల కూటమిగా పోటీచేయాలని నిర్ణయించినట్లు సీపీఐ నేత ప్రకాశ్‌కారత్ పేర్కొన్నారు. ఢిల్లీలో మూడో కూటమి (ధర్డ్ ఫ్రంట్) సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, భాజపాయేతర పార్టీలన్నీ ఇవాళ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూపీఏ పాలన అవినీతిమయమైందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అవినీతి పెచ్చరిల్లిందని అన్నారు. భాజపా, కాంగ్రెస్ విధానాల్లో పెద్ద తేడా ఏమీ లేదని కారత్ పేర్కొన్నారు. కాంగ్రెస్, యూపీఏ కూటమి ఓటమే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.