Site icon TeluguMirchi.com

జగన్ కు ముద్రగడ లేఖ అందుకేనా…!

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మళ్ళీ లేఖల యుద్దం మొదలెట్టారు. కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదని మా కులమంతా 2019 ఎన్నికల్లో మీకే ఓటేశారని మాజీ సీఎం చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసిన కాపు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాపు జాతికి మీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్న ముద్రగడ తాను లేఖలో ప్రస్తావించిన అంశాలు నమ్మితే కాపు జాతికి ఉపకారం చేసిన వారవుతారన్నారు.

 

గత టీడీపీ ప్రభుత్వ హాయంలోనూ కాపుల రిజర్వేషన్ ప్రకియ పై లేఖల మీద లేఖలు రాసిన ముద్రగడ మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు. ఎన్నికల సమయంలో జనసేన,టీడీపీలో చేరేందుకు ఆహ్వానాలు వచ్చినా ఆసక్తి చూపని ముద్రగడ కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కాపురిజర్వేషన్ల పై వైసీపీ ప్రభుత్వానికి లేఖని సంధించారు.

Exit mobile version