ఆయన ప్రమేయం లేదంట !

kannaకళంకిత మంత్రుల రాజీనామాల వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కన్నా ఈరోజు (సోమవారం) విలేకరులతో మాట్లాడుతూ.. 26 జీవోల విషయంలో నా ప్రమేయం లేదని తెలిపారు. మంత్రి వర్గం ఆమోదంతోనే జీవోలు జారీచేశామన్న ఆయన..ఏదైనా వుంటే అధిష్టానం చూసుకుంటుందని పేర్కొన్నారు. కాగా, చత్తీస్ గఢ్ లో చోటుచేసుకున్న ఘటన ప్రజాస్వామ్యానికి విఘూతం కలిగించేలా ఉందని కన్నా అభిప్రాయపడ్డారు.