Site icon TeluguMirchi.com

బాబుతో.. ‘జై తెలంగాణ’ అనిపించండి

kadiyam-srihari-తెదేపాలో సీనియర్ నేతగా ఓ వెలుగువెలిగి.. ఇటీవలే గులాబి గూటికి చేరిన కడియం శ్రీహరి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనపై తెదేపా వరంగల్ నేతలు చేస్తున్న ఆరోపణలు మానుకోకుంటే.. వారి బండారం బయటపెడతానని హెచ్చరించారు. నిన్న కడియం విలేకరులతో మాట్లాడుతూ.. “నా కన్నా ముందే తెరాసలో చేరడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డిలు రెడీ అయ్యారని బాంబు పేల్చారు”. గతంలో ఎర్రబెల్లి, రేవూరిలు.. ఓ పెద్ద బిల్డర్, ఓ ఫౌల్ట్రీ యజమాని ద్వారా తెరాసలో చేరడానికి రాయబారం కూడా నడిపారని, అలాంటి వారికి నా మీద ఆరోపణలు చేసే అర్హత లేదని కడియం అన్నారు. ఆత్మవంచన చేసుకొని తెదేపాలో ఉంటున్న తెలంగాణ నేతలు దమ్ముంటే త్వరలో నిర్వహించబోయే మహానాడులో అధినేత చంద్రబాబు నాయుడుతో ఒక్కసారి జై తెలంగాణ అనిపించగలరా? అని సవాల్ విసిరారు. మరి తెదేపా తెలంగాణ నేతలు కడియం సవాల్ ని స్వీకరిస్తారో లేదో వేచి చూడాలి.

Exit mobile version