డంపింగ్ యార్డుపై జేపీ పోరు..!

Dr. Jayaprakash Narayanకూకట్ పల్లిలోని డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పోరును ఉదృతం చేశారు. డంపింగ్ యార్డును అక్కడి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. జేపీ నిరాహార దీక్షకు దిగారు. డంపింగ్ యార్డ్ వలన నియోజకవర్గ బాధితులు అనారోగ్యానికి గురవుతున్నారని జేపె మండిపడ్డారు. అయితే, జేపీ నిరాహార దీక్షకు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. లోక్ సత్తా పార్టీ తరుపున జేపీ ఒక్కరే కూకట్ పల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం
తెలిసిందే.