Site icon TeluguMirchi.com

విభజనకు నాంది పలికింది వైఎస్సే !

jpప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి భవిష్యత్తు చూపే నాయకత్వం కావాలని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. హైదరాబాదులో లోక్ సత్తా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం, పదవుల కోసం పనిచేసే పార్టీలకు స్వస్తి పలకాలని ఆయన అన్నారు. విభజనకు వైఎస్సే నాంది పలికారన్న జేపీ అందరినీ కూర్చోబెట్టి పరిష్కరించాలన్న జ్ఞానాన్ని కేంద్రం ప్రదర్శించ లేకపోయిందన్నారు . కుమారులు, కుమార్తెలకు అధికారం కట్టబెట్టాలనే ధోరణి కొందరి నాయకుల్లో కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.గత ఐదేళ్ళగా జరిగిన పరిణామాలు అనివార్యమైన పరిస్థితులకు దారీతీశాయని జేపీ పేర్కొన్నారు.

Exit mobile version