ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు రావడం లేదు : చంద్రబాబు

NCBNకరీంనగర్ జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా… మీకోసం’ పాదయాత్ర ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం గంగారం నుంచి ప్రారంభమైంది. గంగారంలో బాబు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీలో వైఎస్ తన అనుకూల వ్యక్తులను పెట్టి వ్యవస్థను భ్రష్టుపట్టించారని విమర్శించారు. తితిదేలో వీఐపీ దర్శనాల వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పేదలు, చేతివృత్తుల వారిని రూ. 10 వేల కోట్లతో అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీసీలకు శాసనసభ ఎన్నికల్లో 50 సీట్లు, స్థానిక సంస్థల్లో 50 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు.