బీజేపీ లో జీవితా రాజశేఖర్

jivitha rajashekahrబిజెపి లో చేరుతున్నట్లు ప్రకటించారు సినీనటులు జీవితా రాజశేఖర్ దంపతులు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో వితా రాజశేఖర్ దంపతులు చర్చలు జరిపారు. దేశంలోని ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుకుంటున్నారని అది బిజెపి తోనే సాధ్యమని తెలిపారు. త్వరలోనే తాము బిజెపి లో కి చేరుతున్నట్లు వెల్లడించారు.

ఇదీలా వుండగా, రాజశేఖర్ దంపతులు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వినిపించాయి. అయితే రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పై వచ్చిన వ్యతిరేకత దృష్ట్యా తమ నిర్ణయం మార్చుకున్నారని వినిపిస్తోంది. ఏదిఏమైనా ఇప్పటికే పలు పార్టీలు మారిన ఈ దంపతులు బిజెపి లోనైనా కొనసాగుతారా అన్నది ప్రశ్న.