Site icon TeluguMirchi.com

జేసీ సంచలన వ్యాఖ్యలు !

jc divakar reddyకాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ బయట ఉన్నా.. లోపల ఉన్నా కాంగ్రెస్ పని ఇక అంతేనన్నారు. ఇక తాను జగన్ తో కలిసి పనిచేయాలా.. ? వద్దా.. ? అని నిర్ణయించుకోవడానికి అసలు కాంగ్రెస్ అంటూ ఉంటే కదా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై జేసీ స్పందిస్తూ.. జగన్ దీక్ష చేపట్టినా.. సమైక్యాంధ్ర సాధ్యం కాదని, ఒక్క సోనియా తలచుకుంటేనే విభజన ప్రక్రియ ఆగిపోతుందని తేల్చిచెప్పారు. అంతేకాకుండా.. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ కుమ్మక్కయ్యాయని బాబు ఈరోజు కొత్తగా ఏమి చెప్పలేదని.. ఆయన ఎప్పుడూ వాడే ఊతపదమేగా అన్నారు. జేసీ చేసిన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశ్చర్యాన్ని కలిగించాయి. అసలు కాంగ్రెస్ కు ఏమాత్రం సీన్ లేదని.. జగన్ ముందు కాంగ్రెస్ కొట్టుకుపోతుందనే విధంగా ఆయన మట్లాడటం సరికాదని ఆ పార్టీ చెందిన నాయకులే గుసగుసలాడుతున్నట్లు సమాచారం. పైగా జేసీ వ్యాఖ్యలు చూస్తే.. వైకాపాలో చేరేందుకు ఆసక్తిగా వున్నట్లు తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version