నా కొడకల్లారా… ఏ రెడ్డి వస్తాడో చూస్తా రండి…!


తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. నియోజకవర్గంలోని గ్రానైట్ వ్యాపారి పై ఫోన్ లో బెదిరింపులకు దిగాడు. కర్నూలు జిల్లా కనకాద్రిపల్లికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి జేసీ సోదరుల అండతో తాడిపత్రిలో గ్రానైట్‌ రవాణా చేసేవాడు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జేసీ నుంచి సైడయ్యారు సుబ్బారావు. దీంతో గ్రానైట్‌ వ్యాపారి సుబ్బారావుకు జేసీ ప్రభాకరరెడ్డి ఫోన్‌ చేసి బెదిరించాడు.

 

‘రేయ్‌ సుబ్బారావు నీ లారీలన్నీ తిరుగుతాయా… నా కొడకుల్లారా నేను కూడా ఈ రోజు బయటకు వస్తున్నా… మీరు పోవాలా నా కొడకల్లారా…. మీ లారీలు అన్ని తిరుగుతాయా… రా నువ్వు వచ్చి నాతో మాట్లాడిపో… ఏ రెడ్డి వస్తాడో చూస్తాం’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. దీంతో సుబ్బారావు ‘అయ్యా వస్తాలే’ అని చెప్పి మరో టీడీపీ కార్యకర్త కొనంకి రమేష్‌నాయుడుతో కలిసి వెంటనే జేసీ వద్దకు వెళ్లాడు. వారు కనిపించగానే జేసీ ప్రభాకరరెడ్డి మరోసారి బూతులతో వారిపై విరుచుకుపడ్డాడు. తనను కాదని వెళ్తే అంతేనంటూ బెదిరించాడు. దీంతో వారు తిరిగి పసుపు కండువా కప్పుకుని ఆయన పంచన చేరారు.