Site icon TeluguMirchi.com

జగన్-రకుల్’కు లింకు పెట్టిన జేసీ.. !

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముక్కుసూటి మనిషి అని చెబుతుంటారు. ఏ విషయంపైనా అయినా జేసీ స్పందన డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఆయన కనబడితే చాలు మీడియాకు పండగే. తాజాగా, జగన్ కు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు లింకు పెట్టి జేసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపై ఎంపీ జేసీ స్పందించారు. ఒకప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను దృష్టిలో పెట్టుకొని జగన్ పాదయాత్ర చేస్తున్నారు. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సభలకు జనాలు వస్తున్నారు. ఆఖరికి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వచ్చిన జనాలు ఎగబడతారని అన్నారు.

Exit mobile version