కాంగ్రెస్ నుంచి పో పొమ్మని అంటున్నారు : జేసీ

jcయూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. ఈ విషయాన్ని పీసీసీ క్రమశిక్షణ కమిటి చైర్మన్ కంతేటీ సత్యనారాయణ వెల్లడించారు.

అయితే ఈ విషయం పై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని అన్నారు. ఈ రోజు ఆయన మీడియా తో మాట్లాడారు. తానూ కాంగ్రెస్ పార్టీని వీడనంటే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ‘పో పోమ్మని’అంటున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఇంకా కొనసాగాలా లేదా వెళ్లిపోవాలా అనే అంశాన్ని తాను ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు. ఇక నా సోదరుడు, కుమారుడు ఏ పార్టీలో చేరతారనేది వారి ఇష్టం అని తెలిపారు.