జనసేన.. ముస్తాబు అవుతోంది

వచ్చే సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ‘జనసేన పార్టీ’ పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జిల్లాలవారీగా పార్టీ కార్యకర్తల ఎంపిక జరిగింది. పార్టీ కార్యక్రమాలని ప్రమోట్ చేసేందుకు సోషల్ మీడియా బృందాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లోని జనసేన పార్టీ ఆఫీసుకు మెరుగులు దిద్దుతున్నారు. ఆఫీసులో అదనపు హంగుల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యాలయం నుంచే పార్టీ అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు సేవలు అందించనున్నాయి.

గత ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఆ ఎన్నికల్లో తెదేపా-భాజాపా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తన దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలపై స్పందించి.. పరిష్కారించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన ఎన్నికల బరిలో దిగనున్నడంతో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారనున్నాయి. ఇంతకీ జనసేన పవర్ ఎంత ? బలమెంత ? అనేది ఈ ఎన్నికల్లో తేలనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముందే పార్టీ పరంగా అన్ని వసతులని పవన్ ఏర్పాటు చేసుకొంటున్నారు. ఇందులో భాగంగానే జనసేన పార్టీ ఆఫీసుకు హంగులు పూస్తున్నారని చెబుతున్నారు.