స్థానిక సమరం పై జనసేన ఫోకస్…!

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జనసేన పార్టీ ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీకి అధ్యక్షుడిగా నియమితులైన తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ పి.రామ్మోహన్‌రావు అధ్యక్షతన కమిటీ సభ్యులంతా ఈరోజు తొలి సమావేశం నిర్వహించారు.

 

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న జనసేన పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. ముందుగా మండల స్థాయిలో పార్టీ కార్యాలయాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం వార్డు స్థాయి నుంచీ చేపట్టాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికలకు అభ్యర్థులను సిద్ధం చేసే అంశానికి సంబంధించి సమావేశంలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. సభ్యులంతా తమ తమ అభిప్రాయాలను కమిటీ చైర్మన్‌కు వివరించారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఈ కమిటీ కొన్ని ప్యూహలు సిద్దం చేసినట్లు తెలుస్తుంది.