సీమాంధ్రులు సహకరించాలి : జానా

janaప్రాంతాలుగా మాత్రమే విడిపోదామని, తెలుగువారిగా కలిసి ఉందామని మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రులు సహకరించాలని కోరారు. అభివృద్ధి కుంటుపడకముందే, పరిస్థితి చేయిజారకముందే, అవాంఛనీయ పరిణామాలు తలెత్తకముందే అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించాని ఆయన కోరారు. అందరూ అధిష్టానానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కారించుకుందామని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు.