లీకవనీయకండీ..!

janareddyకాంగ్రెస్ సీనియర్ నేత, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఈరోజు (శనివారం) సచివాలయంలో..  తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమయ్యారు. అనంతరం జానా విలేకర్లతో మాట్లాడుతూ.. కోర్ కమిటీ భేటీలో చర్చకు వచ్చిన అంశాలపై ముఖ్యమంత్రి లీకులు ఇవ్వడం సరికాదన్నారు. సీఎం క్రమశిక్షణ తప్పారని విమర్శించారు. ఎవరెన్ని లీకులు చేసుకున్నా తెలంగాణను అడ్డుకోలేరని జానా ధీమా వ్యక్తం చేశారు. సీఎం లీకులపై అధిష్ఠానానికి సమాచారం ఉందని, ఆ విషయం వారే చూసుకుంటారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. అధిష్టానంతో చర్చిన అంశాలను తెలంగాణ నేతలు కూడా ఎక్కడా లీక్ చేయరాదని కోరారు.